పాట్నా, ఏప్రిల్ 29: కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ శనివారం నిర్వహించనున్న సీఎంల సమావేశానికి హాజరు కాకూడదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ నిర్ణయించుకొన్నారు. తనకు బదులుగా సమావేశానికి వెళ్లాలని రాష్ట్ర న్యాయ మంత్రిని కోరారు. ఆయన పూర్నియాలో ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో మిత్రపక్షమైన బీజేపీతో పొసగకపోవడం వల్లే నితీశ్ సీఎంల సమావేశానికి హాజరు కావడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నితీశ్ స్థానంలో బీజేపీ నేతను సీఎం చేయాలని బీహార్లో బీజేపీ నేతలు కొంత కాలంగా బహిరంగంగానే అంటున్నారు. తార్కిశోర్ ప్రసాద్ను సీఎం చేయాలని బీజేపీ ఎమ్మెల్యే వినయ్ బిహారీ డిమాండ్ చేశారు.