Union Minister Nitin Gadkari | ప్రముఖ ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ను.. కార్లలో సీట్బెల్ట్ అలారం రాకుండా ఉండేలా రూపొందించిన పరికరాలను విక్రయించడాన్ని నిలిపివేయాలని భారత ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రముఖ వ్యాపారవేత్త, టాటాగ్రూప్స్ మాజీ చైర్మన్ వైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో మిస్త్రీ సీటు బెల్టు పెట్టుకోలేదని తేలింది. ఈ క్రమంలో రోడ్డు భదతా నియమాలపై చర్చ జరుగుతున్నది.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ కారు నడుపుతున్న సమయంలో సీట్బెల్టులు ఉపయోగించని సమయంలో అలారమ్ వస్తుందని, అయితే అలారమ్ రాకుండా ఉండేందుకు అమెజాన్లో అందుబాటులో ఉన్న మెటల్ క్లిప్లను వినియోగిస్తున్నారన్నారు. వాహనదారులు వాటిని కొనుగోలు చేస్తున్నారని, ఈ మేరకు వాటి విక్రయాలను ఆపాలని అమెజాన్కు నోటీసులు పంపినట్లు గడ్కరీ తెలిపారు. గతేడాది భారత్లో వాహన ప్రమాదాల కారణంగా 1.50లక్షల మంది మరణించారని గడ్కనీ పేర్కొన్నారు. ప్రతినాలుగు నిమిషాలకు భారత రోడ్లపై మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ బ్యాంకు గతేడాది చెప్పింది. డ్రైవర్తో పాటు ముందు సీట్తోపాటు వెనుకలా ఉండే సీట్లబెల్ట్లకు అలారాన్ని తప్పని సరి చేయాలని కేంద్రం యోచిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు.