మహానటి సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ వరుస పెట్టి సినిమాలు చేసేస్తుంది. అయితే మహానటి సినిమాలో కాస్త బొద్దుగా కనిపించిన కీర్తి ఇప్పుడు స్లిమ్గా కనిపిస్తూ అభిమానులను ఫిదా చేస్తుంది. ఈ అమ్మడు రీసెంట్గా నితిన్ సరసన రంగ్ దే అనే సినిమాలో నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
రంగ్ దే చిత్ర ప్రమోషన్స్ అన్ని సినిమాల మాదిరిగా కాకుండా కాస్త వైవిధ్యంగా జరుపుతున్నారు. సెట్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ని వీడియోగా రూపొందించి ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్,నితిన్కు సంబంధించిన క్రేజీ విడియో రిలీజ్ చేశారు. ఇందులో డైట్ మెయింటైన్ చేస్తున్న కీర్తి ప్రూట్స్ తింటుండగా, నితిన్ పిజ్జా తినుకుంటూ ఆమెను తినమని ఫోర్స్ చేశాడు. మొదట నో చెప్పిన తర్వాత కంట్రోల్ చేసుకోలేక తినేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని కీర్తి సురేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఫుల్ వైరల్గా మారింది.