ఖానాపూర్ రూరల్, డిసెంబర్ 28: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదనకుర్తికి చెందిన ఆర్మీ ఉద్యోగి శనిగారపు గంగారెడ్డి సోమవారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఆయన హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాల జిల్లాలో పనిచేస్తున్నారు. ముగ్గురు సహచరులతో కలిసి ఎవరెస్ట్ శిఖరాన్ని స్టార్హిల్ వైపు నుంచి ఆరు గంటల సమయంలోనే అధిరోహించారు. గంగారెడ్డిని ఆర్మీ ఉన్నతాధికారులు అభినందించి, జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు భూమవ్వ, రాజలింగంతోపాటు గ్రామస్థులు అభినందించారు.