మాజీ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి
భైంసా, మార్చి 31 : ఇరువర్గాలు సంయమనం పాటించి, భైంసా పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి సూచించారు. భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. ప్రభుత్వం దీనిని తప్పనిసరి చేస్తూ కీలక ఆదేశాలను జారీ చేసిందన్నారు. అలాగే రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆరోగ్య శాఖ సూచనలు తప్పక పాటించాలన్నారు. 45 ఏండ్లు నిండిన వారు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ప్యాడి కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. హమాలీలు, రవాణా తదితర సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆయన వెంట నర్సారెడ్డి, ధర్మాగౌడ్, నాయకులు, తదితరులున్నారు.