డిండి: డిండి ప్రాజెక్టు పరీవాహక ప్రాంతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురు స్తుండడంతో డిండి వాగు ఉప్పొంగి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.
దీంతో ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 36అడుగులు 2.45 టీఎంసీలు కాగా సోమవారం సాయం త్రం 6గంటలకు 35అడుగులు 2.35టీఎంసీలకు చేరుకున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
ప్రాజెక్టులోకి 4500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా ప్రధాన కాలువ ద్వారా 250 క్యూక్కుల నీటిని సేద్యానికి వదులుతున్నారు. మరికొద్ది గంటల్లో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి అలుగు పోసే అవకాశం ఉంది.