హైదరబాదీ బాక్సర్ నిఖత్ జరీన్.. వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో విజయం సాధించి బంగారు పతకం సాధించింది. థాయ్ల్యాండ్కు చెందిన జిట్పాండ్ జుటమాస్తో జరిగిన ఫైనల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన జరీన్.. 5-0 పాయింట్ల తేడాతో ఆమెను ఓడించి, ఫ్లైవెయిట్ చాంపియన్గా అవతరించింది. ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ఈ ఛాంపియన్షిప్లో 52 కేజీల విభాగంలో తలపడిన నిఖత్ జరీన్ చరిత్రాత్మక విజయం సాధించింది.
ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఇంతకుముందు మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖా సి వంటి వారే బంగారు పతకం సాధించారు. ఇప్పుడు నిఖత్ జరీన్ కూడా ఈ ఎలైట్ క్లబ్లో చేరింది. ప్రపంచ టైటిల్ సాధించిన ఐదో భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది.