హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంగమేశ్వర (రాయలసీమ) ఎత్తిపోతల పథకం పనులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై శుక్రవారం తుదితీర్పును వెలువరించనున్నది. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ సర్కారు ఉద్దేశపూర్వకంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. ఏపీ అధికారులను జైలుకు పంపుతామని గతంలో హెచ్చరించిన ఎన్జీటీ ప్రస్తుతం ఎలాంటి తీర్పు ఇస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.