న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించిన సెంట్రల్ విస్టా అవెన్యూ పునరాభివృద్ధి పనులు ఈ నవంబర్ నాటికి పూర్తవుతాయని, వచ్చే ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ వేడుకలు పునరుద్ధరించిన రాజ్పథ్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ పనుల పగ్రతిపై గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, మంత్రిత్వ శాఖ అధికారులు, సీపీడబ్ల్యూడీ, కాంట్రాక్టర్, ఆర్కిటెక్ట్ బిమాల్ పటేల్తో సమీక్షించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.
రాజ్పథ్ పునరాభివృద్ధి ప్రాజెక్టులో పెద్ద ఎత్తున రాతిపని, అండర్పాస్ల నిర్మాణం, భూగర్భ సౌకర్యాల బ్లాక్లు, ఉద్యానవన పనులు, పార్కింగ్కు తగినంత స్థలం ఉందని మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. కృత్రిమ చెరువులపై 12 వంతెనలు నిర్మిస్తున్నారని, రాజ్పథ్ను సందర్శించే ప్రజలకు అద్భుతమైన అనుభూతి లభిస్తుందని పేర్కొన్నారు. సెంట్రల్ విస్టా అవెన్యూ పునరాభివృద్ధి నవంబర్ నాటికి పూర్తవుతుందని, వచ్చే ఏడాది రిప్లబిక్ డే పరేడ్ కొత్తగా అభివృద్ధి చెందిన రాజ్పథ్లో జరుగుతుందని అధికారి వివరించారు.