అనుకున్నదే జరిగింది. ఎప్పుడైతే భారత్ టాస్ ఓడిందో అప్పుడే మ్యాచ్ చేజారిపోయిందని అంతా అనుకున్నట్టే భారత్ చేతుల్లోంచి మ్యాచ్ చేజారిపోయింది. 110 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ 14.3 ఓవర్లలోనే ఇంకా 33 బంతులు మిగిలి ఉండగానే.. 8 వికెట్ల తేడాతో గెలిచింది.
న్యూజిలాండ్ ప్లేయర్లు ఫామ్లో ఉన్నారు. ఫోర్లు, సిక్సులు బాదుతూ.. స్కోర్ను అమాంతం పెంచేసుకుంటున్నారు. మిచెల్.. 30 బంతుల్లో 46 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి దగ్గరున్నాడు. 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి న్యూజిలాండ్ 83 పరుగులు చేసింది. మిచెల్ 4 ఫోర్లు, 3 సిక్సులు కొట్టాడు. విలియమ్సన్ 13 బంతుల్లో 13 పరుగులు చేశాడు.
న్యూజిలాండ్ ప్లేయర్లను కట్టడి చేయడానికి భారత బౌలర్లు బాగానే శ్రమిస్తున్నారు. మూడు నాలుగు ఓవర్ల వరకు న్యూజిలాండ్ పెద్దగా స్కోర్ చేయలేదు కానీ.. విలియమ్సన్ బరిలోకి దిగాక స్కోర్ పెరిగింది. మిచెల్.. 14 బంతుల్లో 19 పరుగులు చేశాడు. జడెజా బౌలింగ్లోనే రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ప్రస్తుతం క్రీజులో మిచెల్, విలియమ్సన్ ఉన్నారు.
న్యూజిలాండ్ ఫస్ట్ వికెట్ కోల్పోయింది. భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 3.4 ఓవర్లలో 24 పరుగులు చేసింది. అయితే.. గప్తిల్.. బుమ్రా బౌలింగ్లో బంతిని పైకి లేపాడు. దీంతో శార్ధూల్ ఠాకూర్ క్యాచ్ పట్టాడు. 17 బంతుల్లో గప్తిల్.. 20 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మిచెల్ 5 బంతుల్లో ఒక్క పరుగు చేశాడు. ప్రస్తుతం క్రీజులో మిచెల్, విలియమ్సన్ ఉన్నారు.
టీ20 ప్రపంచకప్లో భాగంగా ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 110 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగిపోవడంతో ఇండియా అనుకున్నంత స్కోర్ చేయలేకపోయింది. దీంతో న్యూజిలాండ్ ఎదుట స్వల్ప లక్ష్యం ఉంది. 111 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే భారత్ నిర్ధేశించగలిగింది.
టీమిండియా మరో కీలక వికెట్ డౌన్ అయింది. హార్ధిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. బౌల్ట్ బౌలింగ్లో గప్తిల్కు క్యాచ్ ఇచ్చి పాండ్యా వెనుదిరిగాడు. 24 బంతుల్లో 23 పరుగులు చేసిన పాండ్యా ఒక ఫోర్ బాదాడు. మరో ఆటగాడు జడెజా 11 బంతుల్లో 10 పరుగులు చేసి ఒక ఫోర్ కొట్టాడు. 18.1 ఓవర్లలో కేవలం 5.17 రన్ రేట్తో 6 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది భారత్. న్యూజిలాండ్తో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ స్వల్ప స్కోర్తో సరిపెట్టుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడెజా, శార్దూల్ ఠాకుర్ ఉన్నారు.
భారత్ వికెట్లను ఏమాత్రం కాపాడుకోలేకపోతోంది. మొదటి నుంచి వికెట్లను నష్టపోతూ.. స్వల్ప స్కోర్ను చేస్తూ వస్తోంది. ఇప్పటి వరకు 14.3 ఓవర్లు ఆడిన భారత్.. కేవలం 70 పరుగులు మాత్రమే చేసింది. 5 వికెట్లను నష్టపోయింది. మిల్నే బౌలింగ్లో రిషబ్ పంత్ క్లీన్ బోల్డ్ అయ్యాడు. 19 బంతుల్లో పంత్.. 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 11 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజుల్లో పాండ్యా, జడేజా ఉన్నారు.
టీమిండియా కీలక వికెట్ను కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. సోదీ బౌలింగ్లో బౌల్ట్కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు. 17 బంతుల్లో కోహ్లీ కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా ఉన్నారు. పంత్ 11 బంతుల్లో 7 పరుగులు చేయగా… పాండ్యా.. 6 బంతుల్లో 6 పరుగులు చేశాడు. 12 ఓవర్లకు టీమిండియా.. 4 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది.
టీమిండియాకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. 10 ఓవర్లకు కూడా పెద్దగా స్కోర్ చేయలేకపోయింది. ఇప్పటికే మూడు కీలక వికెట్లను భారత్ పోగొట్టుకుంది. 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి భారత్ 48 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఉన్నారు.
కేఎల్ రాహుల్ అవుట్ అయిన రెండు ఓవర్లకే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా అవుట్ అయ్యాడు. సోదీ బౌలింగ్లో గప్తిల్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ పెవిలియన్ బాట పట్టాడు. 14 బంతుల్లో రోహిత్ శర్మ 14 పరుగులు చేశాడు. ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టాడు. విరాట్ కోహ్లీ 8 బంతుల్లో 4 పరుగులు చేశాడు. 7.4 ఓవర్లలో టీమిండియా.. మూడు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్, కోహ్లీ ఉన్నారు.
టీమిండియా రెండో వికెట్ కూడా కోల్పోయింది. సౌథీ బౌలింగ్లో.. కేఎల్ రాహుల్ భారీ షాట్ కొట్టబోయి మిచెల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రాహుల్.. 16 బంతుల్లో 18 పరుగులు చేశాడు. అంతకుముందే ఇషాన్ కిషన్ కూడా క్యాచ్ అవుట్ అయిన విషయం తెలిసిందే. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. 11 బంతుల్లో 13 పరుగులు చేశాడు. 5.5 ఓవర్లలో భారత్ స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 35. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారు.
టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఆదిలోనే భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా, సూర్యకుమార్కు బదులుగా ఈ మ్యాచ్లో ఆడుతున్న ఇషాన్ కిషన్.. అవుట్ అయ్యాడు. బౌల్ట్ బౌలింగ్లో మిచెల్కు క్యాచ్ ఇచ్చి కిషన్ పెవిలియన్ చేరాడు. 8 బంతుల్లో కిషన్ కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు.
టీ20 ప్రపంచకప్లో మరో సమరానికి తెర లేచింది. ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ముందు బ్యాటింగ్ చేయనుంది. ముందుగా అందరూ ఊహించినట్టుగానే టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్లో రెండు టీమ్లకు గెలుపు ఖచ్చితంగా అవసరం. అయితే.. ఈ స్టేడియంలో ఛేజింగ్ ఈజీ అవుతున్న నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా.. హైస్కోర్ చేయగలిగితే.. న్యూజిలాండ్ను తమ బౌలింగ్తో కట్టడి చేయగలిగితే సెమీ ఫైనల్స్పై ఆశలు పెట్టుకోవచ్చు.
గత మ్యాచ్లో పేలవ ప్రదర్శన చేశాడంటూ హార్ధిక్ మీద ఆరోపణలు వచ్చినా.. ఈ మ్యాచ్లో కూడా హార్ధిక్ పాండ్యాను కోహ్లీ తీసుకున్నాడు. టీమిండియా జట్టు నుంచి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఇషాన్ కిషన్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడెజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా బరిలో ఉన్నారు.
టీమిండియాలో కేవలం రెండు మార్పులు మాత్రమే చోటు చేసుకున్నాయి. టీమిండియా ప్లేయర్ సూర్యకుమార్కు వెన్ను నొప్పి ఉండటంతో అతడి ప్లేస్లో ఇషాన్ కిషన్ను తీసుకున్నారు. టాప్ ఆర్డర్లో ఇషాన్ బ్యాటింగ్ చేయనున్నాడు. భువనేశ్వర్ ప్లేస్లో శార్దూల్ ఠాకూర్ను తీసుకున్నారు.
న్యూజిలాండ్ టీమ్లో టిమ్ సైఫెర్ట్ బదులుగా ఆడమ్ మిల్నేను తీసుకున్నారు. డెవన్ కాన్వేను అలాగే ఉంచారు. న్యూజిలాండ్ టీమ్ తుది జట్టులో మార్టిన్ గప్తిల్, మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డెవన్ కాన్వే(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంత్నర్, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే, ఇష్ సోదీ, ట్రెంట్ బౌల్ట్ ఉన్నారు.