మహబూబ్నగర్ టౌన్, జనవరి 6 : రాష్ట్రంలో త్వరలోనే కొత్త క్రీడాపాలసీ తీసుకొస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం మహబూబ్నగర్ బాలుర కళాశాల మైదానంలో శాంతనారాయణగౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైన తర్వాత క్రీడాకారులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికీ రాష్ట్రంలో 50 స్టేడియాల నిర్మాణ పూర్తయిందని చెప్పారు. మరో 50 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఉద్యోగాల్లో కూడా క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్ క్రీడల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ప్రభుత్వ స హకారం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ క్రీడా రంగానికి ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో రూ.10 కోట్లతో క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇందులో రూ.7 కోట్లతో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం అభివృద్ధి, రూ.2.50 కోట్లతో స్టేడియం ఆధునీకరణ, రూ.19 లక్షలతో వాలీబాల్ అ కాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రూ.2.65 కోట్లతో మరో స్టేడియం నిర్మించనున్నట్లు మంత్రి చెప్పారు. పాలమూరు బాలుర కళాశాల మైదా నాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. మ హబూబ్నగర్ పట్టణానికి బైపాస్ రహదారులు, హ న్వాడ వద్ద ఫుడ్పార్క్, మన్యకొండ వద్ద ఎయిర్పోర్టు ఏర్పాటుతోపాటు మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి యు వతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ సతీమణి శారద, రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చై ర్మన్ తాటిగణేశ్, మాజీ కౌన్సిలర్ కృష్ణమోహన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్, కౌన్సిలర్లు రామ్, నర్సింహులు, మునీర్, డీవైఎస్వో శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ భగవంతాచారి, నాయకులు శివశంకర్, శివరాజ్, మోసిన్ తదితరులు పాల్గొన్నారు.