న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం వాయుకాలుష్యం పెరిగింది. గాలి నాణ్యత సూచీ పేలవంగా ఉన్నది. దీపావళి పండుగ నేపథ్యం సూచీ మరింత దిగజారే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా (CBCB) ప్రకారం.. ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 352 నమోదైంది. అలాగే చాలా ప్రాంతాల్లో గురువారం ఉదయం 8 గంటల వరకు గాలి నాణ్యత సూచీ 300 కంటే ఎక్కువగా నమోదైంది.
ఐటీలోలో 354, అయానగర్లో 315, లోధిరోడ్ 303, మేజర్ ధ్యాన్చందన్ నేషన్ స్టేడియం 336, ఐజీఐ విమానాశ్రయం వద్ద 306, చాందినీచౌక్ 341, ద్వారకా సెక్టార్-8లో 340, ఓఖ్లా 359, శ్రీ అరబిందో మార్గ్ 329 గా నమోదైంది. అలాగే ఢిల్లీకి పొరుగున ఉన్న నగరాల్లో సూచీ పూర్ కేటగిరిలో ఉన్నది. ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ తీవ్ర కేటగిరిలోకి వచ్చే అవకాశం ఉందని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఎయిర్ క్వాలిటీ ఫోర్కాస్ట్ ఏజెన్సీ సఫర్ తెలిపింది.