న్యూఢిల్లీ, నవంబర్ 17: దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కన్పిస్తున్నాయని, ఇక పరిశ్రమ రిస్క్లు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్ కంపెనీలకు సూచించారు. బుధవారంనాడిక్కడ సీసీఐ గ్లోబల్ సదస్సు 2021లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కంపెనీలు ఉత్పాదక సామర్థ్యాల్ని విస్తరించాలన్నారు. వినూత్న అవకాశాలు ఆవిర్భవిస్తున్నాయని, అటువంటి టెక్నాలజీని అందించే భాగస్వాముల్ని అన్వేషించడంలో జాప్యం చేయవద్దని విజ్ఞప్తి చేసారు. దేశంలో తయారీ కోసం విడిభాగాల్ని దిగుమతి చేసుకుంటే సమస్యలేదని, తుది ఉత్పత్తుల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించాలన్నారు.