అమరావతి: నెల్లూరు విమానాశ్రయం పనులు ఏప్రిల్లో మొదలు కానున్నాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో విమానాశ్రయం మొదటివిడత పనుల కోసం ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సమర్పించిన డిపిఆర్ను ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. దీంతో ఏప్రిల్ నుంచి దగదర్తిలో 1,379.71 ఎకరాల్లో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. ఈ విమానాశ్రయం కోసం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, కార్గో విమానాలను నడపడానికి ప్రతిపాదన సిద్ధమైన తర్వాత 1,861.20 ఎకరాల భూమి అవసరమైంది.
కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనం, ఎయిర్క్రాఫ్ట్ ఆప్రాన్, సింగిల్ రన్వే, కార్గో హ్యాండ్లింగ్, కార్ పార్కింగ్ సౌకర్యాలు రూ. 368 కోట్ల ఖర్చు కానున్నట్లు అంచనా వేస్తున్నారు. జనవరి నాటికి దగదర్తి, వెలుపోడు, దామవరం, కె కౌరుగుంట గ్రామాల్లో అవసరమైన 1,065.3 ఎకరాల భూమిని జిల్లా యంత్రాంగం సేకరించింది. 2018లో నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియం అయిన ఎస్సీఎల్ టర్బో విమానాశ్రయ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందంపై సంతకం చేసింది. తొలుత నెల్లూరు నుంచి బెంగళూరు, వైజాగ్ , హైదరాబాద్ నగరాలకు విమానాలు నడపనున్నారు. డిమాండ్ ను బట్టి ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారు.