అమరావతి : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి నీలం సాహ్ని శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆమోదించింది.
రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని ఎంపికైన విషయం తెలిసిందే. ఏప్రిల్ 1న ఆమె ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ పదవికి ముగ్గురు ఐఏఎస్ పేర్లను ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా అన్నింటిని పరిశీలించిన ఆయన నీలం సాహ్నిని ఎంపిక చేశారు.
ఇప్పటివరకు వరకు ఏపీ ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం మార్చి 31తో ముగుస్తుంది. ఆ వెంటనే నీలం సాహ్ని నూతన ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.