న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన న్యూఢిల్లీలో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు అమల్లోకి వచ్చింది. దీంతో ఇకపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ బిల్లును గత మార్చి నెలలో పార్లమెంటు ఆమోదించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ తర్వాత ఏప్రిల్ 27 నుంచి అమలులోకి వచ్చింది. ఇప్పటికే ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా వైరం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ చట్టం అమల్లోకి రావడంతో ఇంకెన్ని ఘర్షణలు చూడాల్సి వస్తుందో అని మేధావులు ఆందోళన చెందుతున్నారు.
ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో ఉంటుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వం కంటే సమర్థవంతంగా వ్యవహరిస్తారు. ఇకపై ఢిల్లీ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయాన్ని తీసుకోవలసి ఉంటుంది. శాసనసభకు సంబంధించిన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే, ఎల్జీ నుంచి 15 రోజుల ముందు అనుమతి పొందవలసి ఉంటుంది. పరిపాలనా విషయాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే, 7 రోజుల ముందు అనుమతి పొందడం అవసరం.
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ చాలా నిరసన వ్యక్తం చేశాయి. ఈ బిల్లును సభలో ఆమోదించిన తరువాత, ఇది ప్రజాస్వామ్యానికి చాలా దుర్దినం అని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కాగా, చట్టం అమలులోకి రావడంతో తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఏది ఏమైనా అధికార శక్తిని ప్రజల చేతుల్లో పెట్టడానికి మా ప్రయత్నాలను కొనసాగిస్తాం అని చెప్పారు.
ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చినా కరోనా రావొచ్చు : డాక్టర్ రణదీప్ గులేరియా
దమ్ముంటే నాపై పోటీ చేయాలి : సిద్దుకు కెప్టెన్ ఛాలెంజ్
ఇద్దరు నియంతలు.. ఒకరి జననం.. ఒకరి మరణం.. చరిత్రలో ఈరోజు
పోలీసుల డాటా చోరీ, ఆపై బ్లాక్ మెయిలింగ్..
అమెరికా జనాభా 33 మిలియన్లు.. 2020 సెన్సెస్ డాటా విడుదల
ఇతను ఆఫ్రికా రామ్దేవ్ బాబా..! వీడియో వైరల్
ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ : సీఎస్ఐఆర్ సెరో సర్వేలో వెల్లడి
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..