ముంబై : మహారాష్ట్రలోని ఖర్గార్లో మహారాష్ట్ర భూషణ్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా వడదెబ్బ తగిలి 14 మంది మరణించిన ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత వహించాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) పేర్కొన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని, ఈ ఘటనకు షిండే సర్కార్ బాధ్యత వహించాలని అన్నారు.
ఈ ఘటనపై సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. కాగా, ఖర్గార్ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ఎన్సీపీ నేత, ప్రతిపక్ష నాయకుడు అజిత్ పవార్ డిమాండ్ చేశారు. ఖర్గార్లో ఏం జరిగిందనే దానిపై సమాచారం తెప్పించుకోవాలని కోరుతూ తాను గవర్నర్కు లేఖ రాశానని, ఈ ఘటనలో మృతుల సంఖ్యపైనా గందరగోళం నెలకొందని అజిత్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం సందర్భంగా సరైన ఏర్పాట్లు చేయలేదని కొందరు ఆరోపిస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటివరకూ పోస్ట్మార్టం నివేదిక అందలేదని, ఆర్టీఐ ద్వారా తాను ఈ సమాచారం కోరానని అన్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read More