వరంగల్ : బహుముఖ ప్రజ్ఞశాలి, నవోదయ పాఠశాలల రూపశిల్పి దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పీవీ స్వగ్రామం నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో పీవీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..దేశ ప్రజల అందరిచేత మన్నలను పొందిన గొప్ప నేత పీవీ అన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. గొప్ప సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మేధావి అన్నారు.
రాజకీయ మిత్రులే తప్ప శత్రువులు లేని ఆదర్శప్రాయుడు అని కొనియాడారు. ఇంతటి గొప్ప తనాన్ని సంతరించుకున్న పీవీ మన మట్టిలో పుట్టినందుకు ఈ ప్రాంత వాసులుగా మనం గర్వించాలన్నారు. పీవీ స్మారక కేంద్రంగా లక్నేపల్లి ప్రాంతాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి నిధులను కేటాయించిందన్నారు.