న్యూఢిల్లీ : ఈ నెల 13న జాతీయ క్రీడా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాలులో సాయంత్రం 6.30 గంటలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ నుంచి క్రీడాకారులకు అవార్డులను అందుకుంటారని పేర్కొన్నారు. క్రీడారంగంలో అత్యుత్తమ ప్రదర్శించిన ఆటగాళ్లకు మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న, అర్జున అవార్డులు, కోచ్లకు ద్రోణాచార్య అవార్డులను ప్రదానం చేయనున్నారు.
ఈ సారి 12 మంది క్రీడాకారులకు మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్నా, 35 మంది క్రీడాకారులు అర్జున అవార్డులు, లైఫ్టైమ్ కేటగిరిలో ఐదుగురికి అత్యుత్తమ కోచ్లకు ద్రోణాచార్య, రెగ్యులర్ కేటగిరిలో మరో ఐదుగురు అవార్డులు అందుకోనున్నారు. ఈ సారి నీరజ్ చోప్పా, రవి కుమార్, లోవ్లినా బోర్గోహైన్, శ్రీజేశ్, అవని లేఖాపారా, సుమిత్ యాంటీల్, ప్రమోద్ భగత్, కృష్ణానగర్, మనీష్ నర్వాల్, మిథాలీరాజ్, సునీల్ ఛెత్రి, మన్ప్రీత్ సింగ్ ఖేల్రత్నా అవార్డులకు ఎంపికయ్యారు.