హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ టోర్నీకి హైదరాబాద్ వేదిక కాబోతున్నది. స్థానిక ఎల్బీ స్టేడియంలో బుధవారం నుంచి చాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు జాతీయ పవర్ లిఫ్టింగ్ ప్రధాన కార్యదర్శి కౌస్తవ్ దత్తా వెల్లడించారు. 28 ఏండ్ల తర్వాత రెండో సారి జరుగుతున్న ఈ టోర్నీలో దేశంలోని 22 రాష్ర్టాలకు చెందిన 60 జట్లు పాల్గొంటాయని ఆయన తెలిపారు. జూనియర్, సబ్ జూనియర్, మాస్టర్స్ బాయ్స్, బాలికల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని తెలంగాణ పవర్లిఫ్టింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు రంగీశ్వరి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాజశేఖర్రెడ్డి, చంద్రశేఖర్తో పాటు పలువురు ప్లేయర్లు, కోచ్లు పాల్గొన్నారు.