ఢిల్లీ ,జూన్ 17:గుజరాత్లోని లోథల్లో “జాతీయ సముద్ర వారసత్వ సముదాయఅభివృద్ధి కోసం కేంద్ర నౌకాశ్రయాలు,నౌక రవాణా,జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎంవోపీఎస్డబ్ల్యూ), కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేంద్ర నౌకాశ్రయాలు, నౌక రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు జరిగాయి.
ఢిల్లీలోని ట్రాన్స్పోర్ట్ భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. గుజరాత్లోని అహ్మదాబాద్కు 80 కి.మీ. దూరంలో ఉన్న లోథాల్లో, ఏఎస్ఐ ప్రాంతానికి సమీపంలో ఎంఎంహెచ్సీని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. పూర్వకాలం నుంచి ప్రస్తుతకాలం వరకు ఉన్న మన దేశ సముద్ర వారసత్వాన్ని ప్రదర్శించే ప్రాంతంగా, వరల్డ్ టూరిజం డెస్టినేషన్ గా తీర్చిదిద్దనున్నారు. భారతదేశ సముద్ర వారసత్వంపై ప్రపంచానికి అవగాహన పెంచడానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన “ఎడ్యుటైన్మెంట్” విధానాన్ని ఇక్కడ ఉపయోగిస్తారు.ఎన్ఎంహెచ్సీ వంటి ప్రాజెక్టు దేశంలోనే మొదటిదని, మన దేశంలోని సముద్ర వైభవాన్ని చాటడానికి ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు మన్సుఖ్ మాండవీయ తెలిపారు. మన దేశ సముద్ర చరిత్రను, గొప్ప తీర సంప్రదాయాన్ని ఒకేచోట ప్రదర్శించడానికి,భారతదేశ సముద్ర వారసత్వ ప్రతిష్ఠను అంతర్జాతీయంగా పెంచడానికి ఈ ఎంవోయూ,సాంస్కృతిక శాఖ సహకారం ఉపకరిస్తుందనిఆయన అన్నారు.