హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ వేదికగా ఈనెల 29 నుంచి 50వ జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్బాల్ చాంపియన్షిప్ మొదలుకానుంది. ఈ సందర్భంగా టోర్నీ పోస్టర్ను ఆదివారం రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తున్నదని అన్నారు. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు. స్థానిక సరూర్నగర్ ఇండోర్ స్టేడియంతో పాటు అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ వేదికలుగా టోర్నీ జరుగుతుందని జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పోటీలను విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.