నారాయణపేట రూరల్, అక్టోబర్ 23 : కొవిడ్ కారణం గా పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్ విద్యార్థులను ప్ర మోట్ చేసిన విద్యాశాఖ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు ని ర్వహించేందుకు సన్నద్ధమైంది. విద్యాశాఖ మొదటి ఏడాది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా వాయిదా వేసుకుంటూ వచ్చింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన క్ర మంలో మొదటి ఏడాది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. భవిష్యత్తు రోజుల్లో విద్యార్థులకు ఎ లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుం ది. ఈ మేరకు విద్యాశాఖ నిర్ణయంపై కొందరు కోర్టును ఆ శ్రయించగా పరీక్షల నిర్వహణకు కోర్టు అనుమతినిచ్చింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పిటిషనర్ వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకోవడంతో పరీక్షలకు నిర్వహణకు మార్గం సుగుమమైంది. దీంతో ముం దుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 25 నుంచి ప్రథమ ఏడాది పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూ ర్తి చేసినట్లు ఇన్చార్జి ఇంటర్ విద్యాధికారి సుదర్శన్రావు తెలిపారు.
సర్వం సిద్ధం..
జిల్లా వ్యాప్తంగా ఈనెల 25 నుంచి ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సి ద్ధం చేశారు. జిల్లా మొత్తంగా 4,944 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతి పరీక్ష కేంద్రానికి విద్యార్థుల సంఖ్యను బట్టి ఇన్విజిలేటర్లను, ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్లను నియమిస్తున్నారు. అదేవిధంగా ప్రతి పరీక్ష కేం ద్రానికి ఒక ఫ్లయింగ్ స్కాడ్, రెండు సిట్టింగ్ స్కాడ్ బృం దాలను ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్కాడ్ బృందంలో స్థానిక తాసిల్దార్, ఎస్సై సైతం భాగమవ్వనున్నారు. పరీక్ష కేంద్రం ప్రధాన ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ పూర్తయిన తర్వాతే విద్యార్థులను లోనికి అనుమతించనున్నారు. ప్రతి కేంద్రంలో ఒక ఐసోలేషన్ గదిని కూడా ఏర్పాటు చేశారు. ఆరోగ్య సిబ్బంది సైతం కేంద్రం వద్ద అందుబాటులో ఉండనున్నారు.
జిల్లా వ్యాప్తంగా 18 పరీక్ష కేంద్రాల్లో…
జిల్లాలో మొత్తం 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశా రు. ఆయా కేంద్రాలకుగానూ 18 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 18 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, ఏడుగురు అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు, ఐదుగురు కస్టోడియన్ అధికారులు, 250 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పర్యవేక్షణకు ఫ్లయింగ్, సిట్టింగ్ స్కాడ్ బృందాలను ఏ ర్పాటు చేశారు. వీరితోపాటు డీఈపీ బృందం కేంద్రాలను పర్యవేక్షించనుంది. కేంద్రాల్లో శానిటైజేషన్ పూర్తి చేశారు. విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్ష ప్రారంభ సమయానికి అరగంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షలు ఉదయం 9 నుం చి 12 గంటల వరకు నిర్వహిస్తారు. అదేవిధంగా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్ష విధుల్లో పాల్గొనే అధికారులకు శిక్షణను పూర్తి చేశారు. కేంద్రాల పరిసర ప్రాం తాల్లో 144 సెక్షన్ విధించనున్నారు. పరీక్ష సమయంలో స మీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచేలా చర్యలు చేపట్టనన్నారు. విద్యార్థులు కేంద్రానికి తప్పనిసరిగా మాస్కు, శానిటైజర్తోనే హాజరు కావాలి. జ్వరం లక్షణాలు ఉన్న వా రికి ప్రత్యేక గది కేటాయించనున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
పరీక్షా కేంద్రం పరిశీలన
మరికల్, అక్టోబర్ 23 : మండలకేంద్రంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ మొదటి ఏడా ది పరీక్షా కేంద్రాన్ని శనివారం తాసిల్దార్ శ్రీధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవి డ్ ని బంధనలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు.