వారణాసి: ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో గంగా నది ఒడ్డున ఉన్న 84 ఘాట్లకు కొత్తగా మరో ఘాట్ చేరనుంది. దీనికి ‘నమో’ ఘాట్గా నామకరణం చేశారు. ఈ ఘాట్ వద్ద రెండు చేతులు జోడించి నమస్కరించినట్టుగా మూడు శిల్పాలను ఏర్పాటు చేశారు. నమో అంటే నమస్కరించడం అని, సంక్షిప్తంగా నమో అని పేరు పెట్టామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీదుగా దీనికి పేరు పెట్టారని పలువురు పేర్కొంటున్నారు. అలాంటిదేమీ లేదని అధికారులు చెబుతున్నారు.