రామగిరి: గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గురువారం (ఈనెల7) జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు.అంతేకాకుండా గవర్నర్ పానగల్లోని ఛాయ సోమేశ్వరాలయాన్నిదర్శించనున్న నేపథ్యం లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డిలు ఆలయాన్ని పరిశీలించారు.
ముందస్తుగా కలెక్టర్ ఆలయాన్ని పరిశీలించగా ఆలయ కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి అర్చకులతో ఘనంగా స్వాగతం పలికారు. ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం వారు దేవాలయంలో అభిషేకం చేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్ట ర్ మాట్లాడుతూ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి గైడ్ను పిలిపించాలని కోరారు. ఆలయం చుట్టుపక్కలా ఎలాంటి ముళ్ల పోదలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు.
దేవాలయం ప్రాంతంలో 5మొక్కలు నాటేందుకు గుంతలు తీయించి నేమ్బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా గవర్నర్ పర్యటించే నల్లగొండలోని ఇండియన్ రెడ్క్రాస్ భవనం నూతన గదులు ప్రారంభోత్సవం, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, వర్సిటీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుక, వర్సి టీ వీసీతో సమావేశం నిర్వహించానున్నారు. మరోవైపు పట్టణంలో ఓ ప్రైవేట్ వైద్యశాలను గవర్నర్ ప్రారంభించనుండగా ఆయా ప్రాంతాలలో అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. వారివెంట మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు