రామగిరి: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీల ఛాన్స్లర్ తమిళిసై సౌందర రాజన్ అక్టోబర్ 7న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, ఎస్పీ, డీఐజీ ఏవీ రంగ నాథ్తో కలిసి సందర్శించారు.
వీరికి ఎంజీయూ వీసీ ప్రొ. సీహెచ్.గోపాల్రెడ్డి పుష్పగుచ్ఛాలను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఇండియన్ రెడ్క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించే వర్సిటీ సైన్స్ కళాశాలను పరిశీలించి నిర్వహణకై పలు సూచనలు చేశారు.
అదేవిధంగా ఆర్ట్స్ కళాశాల బ్లాక్లో సమావేశ నిర్వహణ, ఎంజీయూ అభివృద్ధిలోని ముఖ్య ఘట్టాలను వివరించే సమా వేశ మందిరాన్ని పరిశీలించారు. గవర్నర్ పర్యటన విజయవంతం అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేయాలని వీసీని కోరారు. అందుకు తమ సహకారం సైతం అందిస్తామన్నారు. అదేవిధంగా హరిత హరంలో భాగంగా మొక్కలు నాటే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి ప్రతిభించేలా బతుకమ్మ ఉత్సవం చేయనున్నారు.
గవర్నర్ వచ్చివెళ్లేంత వరకు యూనివర్సిటీ పోలీసుల నిఘాలో ఉండనున్నట్లు తెలిసింది. కాగా గతంలో ఉమ్మడి రాష్ర్టాలకు గవర్నర్గా పనిచేసిన ఈఎస్ఎల్ నరసింహన్ సైతం ఎంజీయూను సందర్శించగా ఎంజీయూ సందర్శనకు వస్తున్న రెండో గవర్నర్గా తమిళిసై ముద్ర వేయనున్నారు. గవర్నర్తోపాటు మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నట్లు సమాచారం.
వారి వెంట రెడ్క్రాస్ సంస్థ చైర్మన్ గోలి అమరేందర్రెడ్డి, డీపీఆర్వో శ్రీనివాస్, ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరెడ్డి, నల్లగొండ తహాసీల్దార్ మందడి నాగార్జున్రెడ్డి, ఎం జీయూ మాజీ ఆడిట్ సెల్ డైరెక్టర్ డా. అల్వాల రవి, ఎన్ఎస్ఎస్ కోఆర్డి నేటర్ డా. దోమల రమేశ్, ప్లేస్మెంట్ అధికారి ప్రశాంతి, వర్సిటీ సెక్యూరిటీ ఆఫీసర్ పాపయ్య తదితరులు ఉన్నారు.