దేవరకొండరూరల్, అక్టోబర్ 30 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నాయని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. శనివారం మండలంలోని కర్నాటిపల్లి గ్రామంలో రూ.16 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం కర్నాటిపల్లి, జర్పులతండా గ్రామాల్లో రూ.40.86 లక్షలతో చేపట్టిన బృహత్ పల్లెప్రకృతి వనం, రూ. 4.60 లక్షలతో ఏర్పాటు వైకుంఠ ధామాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో నాటిన మొక్కలను సంరక్షించాలని, ప్రకృతి వనాలను సుందరంగా తీర్చి దిద్దాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసులక్ష్మమ్మాకృష్ణయ్య, జడ్పీటీసీ మారుపాక అరుణాసురేశ్, వైస్ఎంపీపీ చింతపల్లి సుభాశ్, టీఆర్ఎస్ అధ్యక్షుడు టీవీఎన్రెడ్డి, కార్యదర్శి సురేశ్, సర్పంచులు జర్పుల సర్య, అంగోతు కాళి, ఎంపీటీసీ కిషన్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, మునీందర్రెడ్డి, ఏఈ భానుప్రకాశ్, ఎంపీడీఓ శర్మ, రేపాని ఇద్దయ్య, కోటేశ్ పాల్గొన్నారు.