నందికొండ, అక్టోబర్ 27 : నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఒక క్రస్ట్ గేటును 5 అడుగుల మే రకు ఎత్తి 8,100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 590 (312. 0450 టీఎంసీలు)అడుగులకు పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉంది. కుడి కాల్వ ద్వారా 8, 529 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 9,076 , ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 , వరద కాల్వ ద్వారా 400 , ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 33,576 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 6,1481 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతుండగా, అదే స్థాయిలో ఇన్ఫ్లో ఉం ది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 876.80 అడుగులు ( 172.2620 టీఎంసీలు) ఉంది. శ్రీశైలానికి 30,415 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది.
మూసీకి 786 క్యూసెక్కుల ఇన్ఫ్లో
కేతేపల్లి :మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి బుధవారం 786.22 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 662.38 క్యూసెక్కులు, కాల్వలకు 24.44 క్యూసెక్కులు వెళ్తుంది.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 644.50 అడుగులు (4.33 టీఎంసీలు) ఉన్నట్లు అధికారులు తెలిపారు.