ఆత్మకూరు(ఎం), అక్టోబర్21: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని గురువారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో జరుపుకొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ సిమీ ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో మరణించిన ఎస్ఐ సిద్ధయ్య, కానిస్టేబుల్ నాగరాజు, మావోయిస్టుల దాడిలో మృతి చెందిన ఎస్ఐ చాంద్పాషా, ఏఎస్ఐ సుల్తాన్మొహినొద్దీన్, హోంగార్డు లింగయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మధు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరుల త్యాగం వెలకట్టలేనిదన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసుల సేవలు వెలకట్టలేనివి : వైస్ ఎంపీపీ
గుండాల : విధి నిర్వహణలో పోలీసుల సేవలు వెలకట్టలేనివని వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఐ తిరుపతితో కలిసి పోలీస్ అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించి మాట్లాడారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ సంగి వేణుగోపాల్యాదవ్, ప్రధానోపాధ్యాయుడు గిరివర్ధన్, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు కొమ్మగళ్ల దయాకర్, నాయకులు ఉస్మాన్, అనిల్కుమార్యాదవ్ పాల్గొన్నారు.
బొమ్మలరామారం : సమాజానికి పోలీసులు చేస్తున్న సేవలు మరువలేనివని లయన్స్ క్లబ్ ఆఫ్ మీర్పేట్ రీజినల్ చైర్మన్ ఎడ్ల సుఖేందర్రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో సుఖేందర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా సిబ్బందికి మాస్కులు, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మొగులయ్యగౌడ్, జగదీశ్రెడ్డి, పెండెం నాగార్జున, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ గీతాంజలి కళాశాల, శ్రీ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జహంగీర్, వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశం, పోలీస్ అకాడమీ డైరెక్టర్ నల్లమాస రాజు పాల్గొన్నారు.