ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్
మోత్కూరు, నవంబర్ 9 : కేంద్ర ప్రభుత్వం యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని స్పష్టంగా ప్రకటించిందని, దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. మంగళవారం మండల పరిషత్ కార్యలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వానకాలం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తున్నదన్నారు. కేంద్రం ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చి యాసంగి ధాన్యం కొనుగోలు చేయడానికి మోకాలడ్డుతున్నదని పేర్కొన్నారు. అనంతరం ఆయా శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఎంపీపీ దీటి సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీటీసీ సభ్యురాలు గోరుపల్లి శారదాసంతోష్రెడ్డి, ఎంపీడీఓ పి మనోహర్రెడ్డి, వైస్ ఎంపీపీ బుషిపాక లక్ష్మి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్రెడ్డి, రైతు సేవా సహకార సంఘం చైర్మన్ కంచర్ల అశోక్రెడ్డి, , సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
మండలంలోని అనాజిపురం, పాటిమట్ల, మోత్కూరు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, మార్కెట్లో వేబ్రిడ్జిని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, రైతు సహకార సంఘం చైర్మన్ కంచర్ల అశోక్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత, జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ గోపీకృష్ణ, డీసీఓ పరిమళాదేవి, ఏడీఏ వెంకటేశ్వర్రావు, ఏఓ స్వప్న, మార్కెట్ కార్యదర్శి వెంకటేశ్వర్రెడ్డి, సీఈఓ వరలక్ష్మి, ఏపీఎం వెంకటేశ్వర్లు, సర్పంచులు ఉప్పల లక్ష్మి, పేలపూడి మధు, రాంపాక నాగయ్య, దండేబోయిన మల్లేశ్, ఎంపీటీసీ రచ్చ కల్పన, టీఆర్ఎస్ మండల, మున్సిపాలిటీ అధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్, బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, మార్కెట్ వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పేలపుడి వెంకటేశ్వర్లు, నార్మాక్స్ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి పాల్గొన్నారు.
అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు
రాష్ట్ర ప్రభుత్వం శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీ టీచర్లకు ఉచితంగా అందిస్తున్న పోషణ అభియాన్ స్మార్ట్ సెల్ ఫోన్లను ఎమ్మెల్యే మోత్కూరు, అడ్డగూడూరులో ప్రారంభించారు. కార్యక్రమంలో సీడీపీఓ జ్యోత్స్న, సూపర్ వైజర్ మంగమ్మ, అంగన్వాడీ టిచర్లు పాల్గొన్నారు.
సమన్వయంతో పని చేయాలి
అడ్డగూడూరు : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి మండలాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మంగళవారం ఎంపీపీ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం అడ్డగూడూరు, మండలంలోని చిర్రగూడూరు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. నాబార్డు నిధులు రూ.30 లక్షలతో నిర్మించనున్న దోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతీఅయోధ్య, తాసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ చంద్రమౌళి, సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకుబ్రెడ్డి, ఏఓ అరుణకుమారి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్రెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్ తీపిరెడ్డి మేఘారెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి చౌగోని సత్యంగౌడ్, సర్పంచులు పరమేశ్, త్రివేణి పాల్గొన్నారు.