రామగిరి, డిసెంబర్ 8 : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో (2021-22 విద్యాసంవత్సరం) యూజీ, పీజీ విద్యార్థులకు 12 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు వర్సిటీ ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్ తెలిపారు. బుధవారం నల్లగొండలోని యూనివర్సిటీ రీజినల్ కోఆర్డినేషన్ కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని పది అధ్యయన కేంద్రాల్లో డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ తరగతులు జరుగుతాయన్నారు. అదేవిధంగా నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో పీజీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. అదేరోజు విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో కార్యాలయ సిబ్బంది సపావత్ రేఖ్యానాయక్, బద్దం మహేశ్, శ్రీకాంత్, రమేశ్ పాల్గొన్నారు.
రేపటితో అడ్మిషన్లకు తుది గడువు..
బీఆర్ఏఓయూ 2021-22 విద్యాసంవత్సరానికి యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి రూ. 200 అపరాధ రుసుముతో శుక్రవారం వరకు గడువు ఉంది. ఆసక్తి గల విద్యార్థులు www.braou.ac. inలో దరఖాస్తులు సమర్పించాలి. పూర్తి వివరాలకు నల్లగొండలోని రీజినల్ కోఆర్డినేషన్ కేంద్రంలో లేదా 08682-223768 నంబర్లో సంప్రదించాలి’అని ధర్మానాయక్ సూచించారు.