ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో కీలక భూమిక పోషించేవి ‘స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ’(ఎస్ఎంసీ)లు. వీటి పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 30తో ముగిసింది. కొవిడ్ నేపథ్యంలో ఏడాదిన్నరపాటు పాఠశాలలు కొనసాగలేదు. ఈ క్రమంలో కమిటీల చైర్మన్లు, సభ్యులు తాము పూర్తిస్థాయిలో సేవలందించలేకపోయామన్న భావనలో ఉన్నారు. దాంతో మరో 6 నెలలు (డిసెంబర్ 1, 2021 నుంచి మే 31,2022) పాత కమిటీలనే కొసాగించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,111 ప్రభుత్వ పాఠశాలల కమిటీలకు సేవలందించే అవకాశం రావడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ బడుల బలోపేతంలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తుల భాగస్వామ్యంతో పనిచేసేవి ‘స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ’(ఎస్ఎంసీ)లు. వీటినే విద్యాకమిటీలుగా పిలుస్తారు. ఈ కమిటీలు ఆ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ఉపాధ్యాయులతో కలిసి పనిచేస్తూ విద్యార్థ్ధుల విద్యాభ్యున్నతికి దోహదం చేస్తాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,111 ఫ్రభుత్వ పాఠశాలలున్నాయి. నల్లగొండ జిల్లాలో 1483, సూర్యాపేటలో 719, యాదాద్రిభువనగిరిలో 909 పాఠశాలలున్నాయి. వీటి ఎస్ఎంసీలు 2022 మే 31 వరకు కొనసాగనున్నాయి.
పాఠశాల అభివృద్ధిలో కీలకం…
పాఠశాల అభివృద్ధ్దిలో విద్యాకమిటీ (ఎస్ఎంసీ)లది కీలక భూమి. ప్రభుత్వం విద్యాభివృద్ధ్దికి తీసుకొనే ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యమై విజయవంతం చేయడంలో ముందుంటాయి. 2019, నవంబర్ 30న ఎన్నికైన ప్రస్తుత కమిటీలు నామమాత్రంగా పని చేశాయి. దాంతో మరో ఆరు నెలలు సేవలందించేందుకు విద్యాశాఖ అవకాశం ఇచ్చింది.
ఎస్ఎంసీల విధులు ఇవే…
గడువు పెంచడం సంతోషం
ఎస్ఎంసీల గడువు మరో ఆరు నెలలు పొడిగించడం సంతోషకరం. ఉపాధ్యాయులు, గ్రామస్తుల సహకారంతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అమలు చేస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా ఈ సారి ప్రవేశాలు పెరిగాయి. బడీడు పిల్లలంతా బడిలోనే ఉండేలా చూస్తున్నాం. మరో ఆరు నెలలు ఇదే స్ఫూర్తితో పని చేస్తాం.
ఉత్సాహంగా పనిచేయాలి
ప్రభుత్వ బడుల అభివృద్ధ్దిలో ఎస్ఎంసీల పాత్ర కీలకం. గ్రామస్తుల సహకారంతో పాఠశాలలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎస్ఎంసీలను ఏర్పాటు చేసింది. వీటి పదవీకాలం విద్యాశాఖ మరో ఆరు నెలలు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఎస్ఎంసీ చైర్మన్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మరింత ఉత్సాహంతో పని చేయాలి.
వచ్చే ఏడాది మే వరకు..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లోని తల్లిదండ్రులను సభ్యులుగా ఎన్నుకుంటారు. వారిలో సీనియర్ను అధ్యక్షుడు(చైర్మన్), వైస్ చైర్మన్(ఉపాధ్యక్షుడి)గా నియమిస్తారు. వీరి పదవీ కాలం రెండేండ్లు ఉంటుంది. కాగా ప్రభుత్వం ఎస్ఎంసీల ఎన్నికకు నవంబర్30,2019న ఎన్నికలు నిర్వహించింది. వీటి గడువు నవంబర్ 30, 2021తో ముగిసింది. కొవిడ్ నేపథ్యంలో కమిటీలు పూర్తిస్థాయిలో పని చేయలేకపోవడంతో ఆరు నెలలు పాత కమిటీలనే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.