నందికొండ: ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్లో శనివారం పర్యాటకులతో సందడి వాతావరణ నెలకొంది. తెలంగాణ టూరిజం ఏర్పాటు చేసిన లాంచీలో నది మార్గంలో జాలీ ట్రిప్పులకు వెళ్లేందుకు పర్యాటకులు ఉత్సాహం కనబరిచారు.
కృష్ణా నదిలో చూట్టూ నల్లమల అడువుల అందాల మధ్య లాంచీలో ప్రయాణించి పర్యాటకులు చక్కని అనుభూతిని పొందారు. నదితీరంలో సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. నాగార్జునకొండకు అనుమతి లేకపోవడంతో లాంచీ స్టేషన్ నుంచి జాలీ ట్రిప్పులను మాత్రమే నడిపామని లాంచీ స్టేషన్ మేనేజర్ హరిబాబు తెలిపారు.