నందికొండ: నాగార్జునసాగర్ ఎడమకాల్వకు సోమవారం నీటి విడుదలను ఎనెస్పీ అధికారులు నిలుపుదల చేశారు. అధి క వర్షాలతో ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలో ఉన్న చెరువులు, వాగులు అన్ని పూర్తి స్థాయిలో నిండి అలుగు పోస్తుండ డం, తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తతో ఎడమ కాల్వకు నీటి విడుదలను నిలుపుద చేశామమన్నారు.
అవసరాన్ని బట్టి ఎడమ కాల్వకు నీటి విడుదల చేస్తామని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. ఆగష్టు 2వ తేదిన ఖరీఫ్ పంట సాగుకు ఎడమకాల్వకు నీటి విడుదలను ప్రారంభించి, ఇప్పటి వరకు 24 టీఎంసీల నీటిని ఎడమ కాల్వ ద్వారా ఆయకట్టుకు విడుదల చేశామన్నారు.