బొల్లారం, నవంబర్ 10: మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్(ఎంసీఈఎంఈ) ఇండియన్ ఆర్మీ అత్యంత ప్రతిష్టాత్మకమైన సాంకేతిక శిక్షణ సంస్థల్లో పేరుగాంచినది. ఎంసీఈఎంఈ 2020లో న్యాక్ అక్రిడిటేషన్ కోసం నమోదు చేసుకుంది. ఈ మేరకు బుధవారం స్వీయ అధ్యయన నివేదిక ఆధారంగా సైట్ ధ్రువీకరణ నిమిత్తం నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) బృందం ఎంసీఈఎంఈ కాలేజీని సందర్శించింది. ఈ సందర్భంగా ఎంసీఈఎంలో వివిధ ఫ్యాకల్టీలు, శిక్షణ ల్యాబ్లు, అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర సౌకర్యాలను న్యాక్ బృందం పరిశీలించింది. ఈ బృందం తనిఖీ ఫలితంగా ఎంసీఎంఈ ఏ గ్రేడ్తో న్యాక్చే గుర్తింపు పొందినట్లుగా ఎంసీఈఎంఈ కమాండెంట్ లెఫ్టెనెంట్ జనరల్ టీఎస్ఏ నారాయణన్ పేర్కొన్నారు. దేశ రక్షణ వ్యవస్థలో సాంకేతికపరంగా ఎంసీఈఎంఈ అత్యాధునిక శాస్త్ర సాంకేతిక విలువలను జోడిస్తూ విశిష్ట పాత్ర పోషిస్తున్నదని, ఏ గ్రేడ్తో న్యాక్ గుర్తింపు ఇవ్వడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో మిలటరీ అధికారులు పాల్గొన్నారు.