చెన్నె: తన చివరి టీ20 చెన్నైలోనే ఉంటుందని సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అన్నాడు. అయితే వచ్చే ఏడాదా లేక మరో ఐదేండ్ల అనేది తనకు తెలియదు అని పేర్కొన్నాడు. తాజా ఐపీఎల్ సీజన్లో విజేతగా నిలిచిన సీఎస్కే శనివారం చెన్నైలో విజయోత్సవం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఇండియా సిమెంట్స్ వైస్ ఛైర్మన్, ఎండీ శ్రీనివాసన్, భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ ‘ప్రణాళికగా నేను క్రికెట్ను ఆడుతా. చివరి మ్యాచ్ నా స్వస్థలం రాంచీలోనే ఆడాను. నా ఆఖరి టీ20 కూడా చెన్నైలోనే ఉంటుందని భావిస్తున్నా. అయితే వచ్చే ఏడాదినా? లేక ఐదేండ్లకా అనేది నాకు తెలియదు. అభిమానుల ప్రేమతోనే సీఎస్కే ట్రోఫీ సాధించింది. మేం ఎక్కడ ఆడినా కూడా మద్దతు లభించింది. రెండేండ్లు ఐపీఎల్కు దూరమైనా కూడా చెన్నైకి సోషల్ మీడియాలో అభిమానం లభించింది’ అని అన్నాడు.