ముంబై: ఆఫ్ఘనిస్తాన్కు చెందిన 35 ఏళ్ల ముస్లిం మత గురువు ఖ్వాజా సయ్యద్ చిస్తీని గుర్తు తెలియని వ్యక్తులు మహారాష్ట్రలోని నాసిక్లో కాల్చి చంపారు. ఈ ఘటన యేలో పట్టణంలో జరిగింది.ఆ హత్య వెనుక ఉన్న కారణాలు ఇంకా తెలియరాలేదు. యేలా పట్టణంలో ఉన్న ఎంఐడీసీ ఓపెన్ ప్లాట్లో మంగళవారం సాయంత్రం ఈ మర్డర్ జరిగింది. ఈ ప్రాంతం ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఖ్వాజా సయ్యద్ చిస్తీని పాపులర్గా సూఫీ బాబాగా గుర్తించారు. దుండగులు బాధితుడి నుదుటిపై పిస్తోల్ పెట్టి కాల్చారు. దాంతో అతను అక్కడిక్కడే మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. సూఫీ బాబాను చంపి అతనికి చెందిన ఎస్యూవీ వాహనాన్ని ఆగంతకులు ఎత్తుకెళ్లారు. యేలా పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు నమోదు అయ్యింది. హంతకుల కోసం వేట కొనసాగుతోంది.