బాలీవుడ్లో కరోనా కలకలం గుబులు రేపుతుంది. సెకండ్ వేవ్ విసృతంగా వ్యాప్తి చెందుతుండడంతో చాలా మంది సెలబ్స్ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పి లహరి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గత కొద్ది రోజులుగా ఆయనతో కాంటాక్ట్ ఉన్న వాళ్లందరు పరీక్షలు చేయించుకోవాలని బప్పి లహరి మేనేజర్ పేర్కొన్నారు. అతనికి దేశ విదేశాల నుండి మెసేజెస్ వస్తున్నాయి. ఆయన క్షేమం కోరుకునే వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని స్పోక్స్ పర్సన్ స్పష్టం చేశారు.
ఇప్పటికే బాలీవుడ్ నటుడు మనోజ్ కరోనా బారిన పడగా, అనంతరం యాక్టర్ ఆశిష్ విద్యార్థి ,బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్, సంజయ్లీలా భన్సాలీ, ‘గల్లీభాయ్’ ఫేమ్ సిద్ధార్థ్ చతుర్వేది, హీరోయిన్ తారా సుతారియా, ‘మైదాన్’ చిత్ర దర్శకుడు అమిత్ శర్మ , ‘దంగల్’ ఫేమ్ ఫాతిమా సనా షేక్, యంగ్ హీరో విక్రాంత్ మెస్సీ , యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, నటుడు పరేష్ రావల్,మాధవన్,ఆమిర్ ఖాన్,మనోజ్ బాజ్పాయ్,దర్శకుడు కనుబెల్ ఇలా పదిహేనుకు పైగా బాలీవుడ్ సెలబ్స్ కరోనా బారిన పడ్డారు.