విజయ్శంకర్, అషూరెడ్డి, సుహాసిని మణిరత్నం, భానుచందర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఫోకస్’. టి.సూర్యతేజ దర్శకుడు. ఈ చిత్రంలోని సీనియర్ నటి సుహాసిని లుక్పోస్టర్ను ఇటీవల ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’ అన్నారు. జీవా, షియాజీషిండే, భరత్రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యజమాన్య.