హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రణాళికాబద్ధమైన పట్టణాల అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి పట్టణానికి మాస్టర్ప్లాన్ను రూపొందించాలని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఇటీవల ఆదేశించారు. వచ్చే జూన్ 2.. తెలంగాణ అవిర్భావ దినోత్సవం నాటికి మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేయాలని సూచించటంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో పెద్దఎత్తున మున్సిపాలిటీలను ఏర్పాటుచేసింది. కొత్త మున్సిపాలిటీలను మొదటినుంచే ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయటానికి మాస్టర్ప్లాన్ అత్యంత కీలకమని ఇటీవల ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతి మున్సిపాలిటీకి మాస్టర్ప్లాన్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టంచేశారు.
మంత్రి ఆదేశాలకు అనుగుణంగా మున్సిపల్శాఖ అధికారులు కార్యాచరణ సిద్ధంచేశారు. రాష్ట్రంలో జీహెచ్ఎంసీతోసహా 142 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 70 పట్టణాలు, నగరాలకు మాస్టర్ప్లాన్లు సిద్ధంగా ఉన్నాయి. 35 మున్సిపాలిటీలకు మాస్టర్ప్లాన్లు రూపొందించే పనులు చురుకుగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా మాస్టర్ప్లాన్ల రూపకల్పన పూర్తవుతుందని అధికారులు తెలిపారు. మిగిలిన 37 పట్టణాలకు మాస్టర్ప్లాన్ల రూపకల్పన బాధ్యతలు ఏజెన్సీలకు అప్పగించనున్నారు. వచ్చే ఏడాది జూన్ 2 కల్లా ప్రతి పట్టణానికి, నగరానికి మాస్టర్ప్లాన్ ఉండేలా ప్రణాళిక రూపొందించారు.
మాస్టర్ ప్లాన్తో జరిగేది ఇదీ..