ఆ ఊరిలో ఎటుచూసినా కూరగాయల పంటలే, ఒకరు టమాట వేస్తరు, ఇంకొకరు మిర్చి వేస్తరు, మరొకరు ఆకుకూరలు పండిస్తరు. బెండ, కాకర, గోకర, బీర, బీన్స్, చిక్కుడు, దొండ, పొట్లకాయ, వంకాయ ఇలా అన్ని రకాల కూరగాయలను సాగు చేస్తరు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ఊరు.. కూరగాయల క్షేత్రం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం తిమ్మాపూర్లో రైతులు తీరొక్క పంటను పండిస్తూ రోజూ ఆదాయాన్ని పొందుతున్నరు. కొందామంటే కూరగాయలు దొరకని పరిస్థితి నుంచి హైదరాబాద్కు ఎగుమతి చేసే స్థాయికి చేరిందీ ఊరు. మరి అందుబాటులో నీరున్నా ఈ గ్రామస్తులు వరి ఎందుకు వేయడం లేదు.. ఇతర పంటలవైపే మొగ్గుచూపుతున్నారు? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.