బాలాసోర్, మార్చి 27: ఉపరితలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల మధ్యశ్రేణి క్షిపణిని (ఎంఆర్సామ్) భారత్ విజయవంతంగా పరీక్షించింది. క్షిపణి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆదివారం ఉదయం ఈ పరీక్ష నిర్వహించినట్టు డీఆర్డీవో తెలిపింది.