హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు, నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీ దీవకొండ దామోదర్రావు (Divakonda Damodar Rao) మాతృమూర్తి ఆండాలు కన్నుమూశారు. గతకొంతకాలంగా వయోసంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు జూబ్లిహిల్స్ మహాప్రస్తానంలో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్లోని నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది.