హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేసేదిలేదని కేంద్రం చెప్తుంటే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం వరి సాగుచేయాలని రైతులను కోరుతున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు. బీజేపీ నేతల ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మంత్రి నిరంజన్రెడ్డి రాసిన ‘అపాథటిక్ గవర్నెన్స్ అగోనైజ్డ్ ఫార్మర్స్’ అనే వ్యాసాన్ని అసద్ ట్వీట్ చేస్తూ ఈ కామెంట్ చేశారు.