హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఉద్యోగులకు వరాలు ప్రకటించడం పట్ల తెలంగాణ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు కే పాపారావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే ఉద్యోగులకు 43శాతం పీఆర్సీ ప్రకటించి వెన్నుదన్నుగా నిలిచారని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ వయసు 61 ఏండ్లకు పెంచి.. 30 శాతం పీఆర్సీ ప్రకటించి ఉద్యోగుల పట్ల తనకున్న అమితమైన ప్రేమను కేసీఆర్ మరోసారి చాటుకున్నారు. ఉద్యోగుల పక్షపాతిగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని అని ఆయన కొనియాడారు. పేదల సంక్షేమానికి అనే పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తూనే.. ఉద్యోగుల అభ్యున్నతికి సీఎం విశేషంగా కృషి చేస్తున్నారని పాపారావు పేర్కొన్నారు.