కీవ్: రష్యా ఇవాళ తెల్లవారుజామున భీకర ఫైరింగ్ జరిపింది. కీవ్పై మిస్సైళ్ల వర్షం కురిపించింది. జనావాసాలను టార్గెట్ చేశారు. కీవ్లోని పలు ప్రాంతాల్లో ఉన్న బిల్డింగ్లు ఆ దాడికి ధ్వంసం అయ్యాయి. సతోసిన్స్కీ జిల్లాలో 9 అంతస్తుల బిల్డింగ్ మంటల్లో చిక్కుకున్నది. దానికి సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేశారు. ఈ ఘటనలో ఎవరైనా మృతిచెందారా అన్న విషయాన్ని ఇంకా తెలుపలేదు. మరో టార్గెట్లో మెట్రో స్టేషన్ ధ్వంసమైంది. లుకియానిస్కా మెట్రో స్టేషన్ను పేల్చేశారు. కీవ్ సెంటర్కు సమీపంలో ఈ స్టేషన్ ఉంటుంది. డ్యామేజ్ కావడం వల్ల ఆ స్టేషన్ను మూసివేశారు.
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం నేటితో 20 రోజులకు చేరుకున్నది. ఇవాళ ఉదయం ఉక్రెయిన్ సైనిక దళాల చీఫ్ కొంత సమాచారం అందజేశారు. రష్యాకు చెందిన నాలుగు హెలికాప్టర్లు, ఓ విమానంతో పాటు క్రూయిజ్ మిస్సైల్ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యా దళాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నట్లు ఉక్రెయిన్ చెప్పింది. క్షిపణులు, బాంబులతో కీలక మౌళికసదుపాయాలపై రష్యా దాడులు చేస్తూనే ఉన్నది.