ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో తెలుగు, తమిళం, మలయాళ భాషలకు చెందిన పలు సినిమాలు సత్తా చాటాయి. తెలుగు సినిమాకు నాలుగు అవార్డులు దక్కగా, ఇందులో బెస్ట్ పాపులర్ ఫిల్మ్గా మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ ఎంపికైంది.ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నాని నటించిన ‘జెర్సీ’ కిఅవార్డ్ దక్కింది. ఇక మహర్షి’ చిత్రానికి నృత్యాలు సమకూర్చిన రాజు సుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్గా, ‘జెర్సీ’కి ఎడిటింగ్ చేసిన నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్గా జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు
ఇక మలయాళ ఇండస్ట్రీకి సంబంధించి మోహన్లాల్ నటించిన మరక్కార్ మళయాళ చిత్రానికి గాను ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్ కేటగిరీల్లో అవార్డు లభించింది. ఈ చిత్రం గత ఏడాది మార్చి 26న విడుదల కావలసి ఉండగా, కరోనా వలన వాయిదా పడింది. ఇప్పుడు మే 19,2021న విడుదల చేయనున్నారు. అయితే గత ఏడాదే ఈ చిత్రం సెన్సార్కు వెళ్లడం వారి నుండి క్లియరెన్స్ రావడంతో 2020లో వచ్చిన చిత్రంగా జ్యూరీ పరిగణించి అవార్డులని ప్రకటించంది.ఈ విషయం ఇండస్ట్రీకి చెందిన చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.