హైదరాబాద్: ఆస్ట్రేలియాలో అక్టోబర్లో జరిగే టీ20 వరల్డ్కప్ కోసం సోమవారం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయితే ఆ జట్టు ప్రకటనపై మాజీ కెప్టెన్ అజారుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. టోర్నీ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల్లో శ్రేయాస్ అయ్యర్, మహమ్మద్ షమీ లేకపోవడం పట్ల అజార్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. మెయిన్ స్క్వాడ్కు ఎంపిక చేసిన దీపక్ హూడా స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఉండాలని, ఇక హర్షల్ పటేల్ స్థానంలో షమీని తీసుకోవాలని అజార్ తన ట్విట్టర్లో అభిప్రాయపడ్డారు. వరల్డ్కప్ జట్టు కోసం స్టాండ్బైలను ప్రకటించిన జాబితాలో అయ్యర్, షమీ ఉన్న విషయం తెలిసిందే.
Surprised at the omission of Shreyas Iyer and Md. Shami from the main squad. https://t.co/GOKUzRyMot
— Mohammed Azharuddin (@azharflicks) September 12, 2022