లాహోర్: పాకిస్థాన్ సీనియర్ ఆల్రౌండర్ మహమ్మద్ హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2018లో టెస్టులకు గుడ్బై చెప్పిన హఫీజ్ సోమవారం పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్లో 55 టెస్టులు, 218 వన్డేలు, 119 టీ20లు ఆడిన ఈ సీనియర్ ఆల్రౌండర్ పాక్ క్రికెట్ చరిత్రపై చెరగని ముద్ర వేశాడు. మొత్తం 392 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 12,789 పరుగులు చేసిన హఫీజ్ 253 వికెట్లు పడగొట్టాడు. హఫీజ్ తన కెరీర్లో మూడు వన్డే, ఆరు టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో పాక్కు ప్రాతినిధ్యం వహించాడు. 18 ఏండ్లు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు అని ఈ సందర్భంగా హఫీజ్ ట్వీట్ చేశాడు.
అవినీతి ఆటగాళ్లను ఆడించొద్దు
మ్యాచ్ ఫిక్సింగ్లకు పాల్పడిన ఆటగాళ్లను పాక్ తరఫున ఆడించ వద్దని పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ హఫీజ్ విజ్ఞప్తి చేశాడు. రిటైర్మెంట్ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పై వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడి దేశాన్ని అవమానించిన వారిని ఎప్పటికీ ఆడనివ్వ వద్దని కోరాడు. మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడి ఐదేండ్ల నిషేధానికి గురైన మహమ్మద్ ఆమీర్ మళ్లీ జట్టులోకి రావడాన్ని హఫీజ్ పరోక్షంగా ప్రస్తావించాడు.