కావలసిన పదార్థాలు
గోధుమ పిండి, మైదా పిండి: ఒక కప్పు చొప్పున, క్యాబేజీ, క్యాప్సికం, బీన్స్, క్యారెట్ తురుము: పావు కప్పు చొప్పున, తురిమిన చీజ్: రెండు టేబుల్ స్పూన్లు, కారం: ఒక టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, వేయించిన జీలకర్ర పొడి: అర టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, వెన్న: ఒక టేబుల్ స్పూన్, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
ఒక గిన్నెలో గోధుమ పిండి, మైదా పిండి, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లుపోసి ముద్దగా చేసి అరగంటపాటు పక్కనపెట్టాలి. పాన్లో వెన్న వేడయ్యాక క్యాబేజీ, క్యారెట్, బీన్స్, క్యాప్సికం తురుము, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు వేసి కలుపుతూ పది నిమిషాలపాటు సన్నని మంటపై వేయించాలి. చివరగా చీజ్ తురుము జోడించి బాగా కలిపి దింపేయాలి. పిండిని కొద్దికొద్దిగా తీసుకుని మందపాటి చపాతీలా ఒత్తుకుని.. మధ్యలో క్యాబేజీ మిశ్రమం పెట్టి అంచులు ముడిచి మళ్లీ పరోటాల్లా ఒత్తుకోవాలి. పెనం మీద రెండు వైపులా నూనె లేదా వెన్నతో కాల్చుకుంటే వేడివేడి మొఘలాయ్ పరోటాలు సిద్ధం.